|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ఆదేశాల మేరకు ట్రాఫిక్ పోలీసులు నిజామాబాద్ నగరంలోని దేవీ రోడ్డు, రైల్వే స్టేషన్ రోడ్డు ప్రాంతాల్లో అక్రమంగా ఏర్పాటు చేసిన ఫుట్పాత్ దుకాణాలను తొలగించారు. వీటి కారణంగా ట్రాఫిక్కు అంతరాయాలు ఏర్పడుతున్నందున ట్రాఫిక్ ఏసీపీ ఆధ్వర్యంలో పోలీసులు చర్యలు తీసుకుని ఫుట్పాత్ను స్వేచ్ఛగా ఉపయోగించేలా చేశారు.
అదే విధంగా, ఆర్మూర్ బస్టాండ్ పరిసరాల్లో కూడా ట్రాఫిక్ సమస్యలను తగ్గించే ఉద్దేశ్యంతో అక్రమంగా ఆక్రమించిన ఫుట్పాత్ దుకాణాలను తొలగించారు. ప్రజల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ సాఫీగా కొనసాగేలా చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. అక్రమ వ్యాపారులు మళ్లీ ఫుట్పాత్ను ఆక్రమించకుండా ప్రత్యేక గస్తీ ఏర్పాటు చేసినట్లు ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు.
ఈ చర్యల ద్వారా నగర ట్రాఫిక్కు గల అంతరాయాలు తొలగి, పాదచారులు సౌకర్యంగా ప్రయాణించే అవకాశం లభించనుంది.








