నిజామాబాద్ జిల్లాలో భారీ చోరీ : భారీగా నగదు, బంగారం, వెండి అపహరణ.

|| దృశ్యం న్యూస్ ||

నిజామాబాద్ జిల్లా, ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామంలో శుక్రవారం రాత్రి భారీ చోరీ జరిగింది.
నీలం భాస్కర్ కుటుంబం శుక్రవారం బంధువుల వివాహ వేడుకకు హాజరు కావడానికి ఇంటికీ తాళం వేసి బయలుదేరి, శనివారం ఉదయం ఇంటికి తిరిగి వచ్చి చూడగా వారి నివాసంలో వస్తువులు మొత్తం చిందరవందరగా పడి ఉండడం చూసి కుటుంబ సభ్యులు ఇంట్లో దొంగలు దొంగతనానికి పాల్పడినట్లు గుర్తించి ఎడపల్లి మండల పోలీసులకు సమాచారం అందించారు. ఈ విషయమై సంఘటన స్థలానికి పోలీసులు క్లూస్ టీంతో చేరుకొని ఆధారాలు సేకరించి, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

 

చోరీలో దొంగలు 3 లక్షల 50 వేల రూపాయల నగదు, 15 తులాల బంగారం మరియు 2 కిలోల వెండి సామగ్రిని అపహరించుకుపోయారని కుటుంబ సభ్యులు తెలిపారు.

 

ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతూ ఇంట్లో లభించిన ఆధారాలతో త్వరలో దొంగలను పట్టుకొని బాధితులకు న్యాయం చేకూరుస్తామని తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment