|| దృశ్యం న్యూస్ ||
బాన్సువాడ పట్టణ కేంద్రంలోని MLA క్యాంపు కార్యాలయంలో బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో 181 లబ్ధిదారులకు రూ. 1 కోటి 81 లక్షల 20 వేల 996/- విలువైన చెక్కులు అందజేయడమైనది. బాన్సువాడ పట్టణ, గ్రామీణ, బీర్కూర్, నస్రుల్లాబాద్ మండలాల వారీగా ఈ చెక్కులు పంపిణీ చేయబడ్డాయి.
ఈ కార్యక్రమంలో బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ,
ఈ రకమైన ప్రభుత్వ మద్దతుతో ప్రజలకు ఆర్థిక సహాయం అందించడం, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే లక్ష్యంగా కొనసాగుతుందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా, కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ స్కీంలతో సహాయం అందుకున్న లబ్ధిదారులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతలు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, ఇతర అధికారులు కూడా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.








