కుర్నపల్లి గ్రామ ప్రాథమిక పాఠశాలలో కృత్రిమ మేధ (AI) తరగతులను ప్రారంభించిన ఎంఈఓ గాలప్ప.

|| దృశ్యం న్యూస్ ||

నిజామాబాద్ జిల్లా, ఎడపల్లి మండలం, కుర్నపల్లి గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల (MPPS)లో ఈ రోజు నుండి కృత్రిమ మేధ (AI) తరగతులు ప్రారంభించబడ్డాయి.
ఈ కార్యక్రమం విద్యార్థులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందించడంలో ముఖ్యమైన అడుగుగా నిలుస్తుందని.

ఈ AI తరగతులు విద్యార్థులకు కృత్రిమ మేధని గురించి అవగాహన కల్పించడం, సమస్య పరిష్కార నైపుణ్యాలను అభివృద్ధి చేయడం, మరియు సాంకేతిక రంగంలో అవకాశాలను అన్వేషించడంలో సహాయపడతాయి అని, ఈ చర్య ద్వారా విద్యార్థులు భవిష్యత్ సవాళ్లకు సమర్థంగా ఎదుర్కోవడానికి సిద్ధమవుతారు అని ఎంఈఓ గాలప్ప తెలిపారు.

ఈ కార్యక్రమం కర్నపల్లి గ్రామంలోని విద్యా రంగంలో సాంకేతిక అభివృద్ధికి దోహదపడుతుంది. ఇది విద్యార్థులకు ప్రపంచ స్థాయి నైపుణ్యాలను అందించడంలో కీలకమైన పాత్ర పోషిస్తుంది అని, ఈ సందర్భంగా పాల్గొన్న ఉపాధ్యాయులు పేర్కొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment