|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ జిల్లా వర్ని మండలం, సత్యనారాయణపురం గ్రామంలో ఎమ్మార్పీఎస్ నాయకులు నిరవధిక నిరసన దీక్ష చేపట్టారు.
గ్రామంలోని సుభాష్ చంద్రబోస్ చౌరస్తా సమీపంలో జరిగిన ఈ నిరసనలో గ్రూప్ వర్గీకరణ చట్టబద్ధత లేకుండా ఫలితాలు విడుదలైనందుకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో వర్ని మండల ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు మేదరి శేఖర్, ఉపాధ్యక్షులు మొరుగు కాశీరాం, కార్యదర్శి అశోక్, మరియు కుల సంఘాల నాయకులు రవికుమార్, రాప గంగాధర్, సాయిలు, సిందగడి రవి, కోటయ్య, రాజు తదితరులు పాల్గొన్నారు.








