కూతురుతో సహా తండ్రి చెరువులోకి దూకి ఆత్మహత్య : గాలింపు చర్యల్లో పోలీస్ అధికారులు.

|| దృశ్యం న్యూస్ ||

నిజామాబాద్ నగర శివారులోని న్యాల్ కల్ చెరువులో సోమవారం తెల్లవారుజామున ఓ తండ్రి, కూతురుతో కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డారు.
స్థానిక సమాచారం ప్రకారం వర్ని చౌరస్తాకు చెందిన క్రాంతి (35) అనే వ్యక్తి తన 2 సంవత్సరాల కూతురుతో కలిసి బైక్ పై చెరువుకు చేరుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడని..
ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. పోలీసులు గజ ఈతగాళ్ల సహాయంతో చెరువులో గాలింపు చర్యలు చేపట్టి ఈ సంఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు.

ఇలా వరుస కుటుంబ ఆత్మహత్యలు జరగడంతో స్థానిక నిజామాబాద్ ప్రజలను కలవరనికి గురి చేసింది. ఆత్మహత్యకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడి కావచ్చు ఘటన స్థలంలో పోలీసులు పర్యవేక్షణలో ఉన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment