|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ పట్టణంలోని 19వ డివిజన్ కంటేశ్వర్లో శ్రీ మహాలక్ష్మి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారి బోనాల పండుగ భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించబడింది. ఈ వేడుకకు ఇందూర్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై భక్తిపూర్వకంగా బోనం సమర్పించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్ పాల్ మాట్లాడుతూ — “మహాలక్ష్మి అమ్మవారి బోనాలు తెలంగాణ ఆచార–సాంప్రదాయాల ప్రతిబింబం. ప్రజల ఐకమత్యం, భక్తి, సాంస్కృతిక విలువలకు ప్రతీకగా ఈ పండుగ నిలుస్తోంది,” అని పేర్కొన్నారు.
ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజలు, బోనాల సమర్పణలు, భక్తుల పాల్గొనడంతో ప్రాంతమంతా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. మహిళలు భక్తిపూర్వకంగా బోనాలు సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు నాగోల్ల రవి, బిజెపి నాయకులు జిల్లా ప్రధాన కార్యదర్శి నాగోల్ల లక్ష్మీనారాయణ, మేకల సాయి ప్రవీణ్, బెండ ప్రసాద్, గుండు రవి, సాయిరాం, సాయిలు తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.








