|| దృశ్యం న్యూస్ ||
దీపావళి పండుగ హిందువులకు ఎంతో ప్రత్యేకమైన సందర్భం, ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీ దేవి పూజలతో పాటు టపకాయలు కాల్చడం ఒక ప్రాచీన ఆచారం.
ఈ సంవత్సరం మార్కెట్లో టపకాయల ధరలు ప్రస్తుతానికి అత్యంత తారస్థాయిలో ఉన్నాయని తెలుస్తోంది, ప్రజలు ఆనవాయితీగా ఈ బాణసంచా కొనుగోలు చేయాలని చూస్తున్నా, ధరల అధికత వారికి నిరుత్సాహాన్ని కలిగిస్తోంది.
గత సంవత్సరం కంటే టపకాయల ధరలు భారీగా పెరిగినట్టు స్పష్టంగా కనపడుతోంది, ఈ పరిస్థితి పేద ప్రజలపై ఆర్థిక భారాన్ని పెంచింది, పండుగలు సంతోషంగా జరుపుకునేందుకు ప్రజలు ఆసక్తి చూపించినా, ఈ అధిక ధరల కారణంగా వారి కట్టుబాట్లు విడిచి పెట్టె పరిస్థితి నెలకొంటుంది, పండగ వేళ ఆర్థిక పరంగా నమ్మకం నిలుపుకోవడం కష్టమవుతోంది.
టపకాయల ధరలు నియంత్రించకపోతే, భవిష్యత్తులో పండుగలపై ప్రజలు ఆసక్తి కోల్పోతారని వారు భావిస్తున్నారు, ప్రభుత్వం ఈ అధిక ధరలపై సరైన నియంత్రణలు తీసుకోకపోతే, పండుగలు జరుపుకునే అవకాశాలు తగ్గిపోతాయని ఆవేదన వ్యక్తమవుతోంది, దీపావళి వంటి పండుగల సమయంలో పేద ప్రజలు సంతోషంగా పండుగలు జరుపుకోవాలంటే, ఇది ముఖ్యమైన అంశంగా గుర్తించాలని ప్రజలు భావిస్తున్నారు.
ఈ పండుగ సందర్భంగా ప్రజల ఆర్థిక స్థితి వల్ల ఇబ్బంది పడకుండా ధరలను నియంత్రించడం అత్యవసరం అని, టపకాయల ధరలపై ప్రభుత్వం స్పందించాలని, తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతు ఇలాంటి పండుగల వేళ అందరికి ఆనందాన్ని పంచేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.
మీ దృశ్యం న్యూస్.









