నిజామాబాద్ : ఆస్తి పన్ను సేకరణపై సమీక్షా సమావేశం.

|| దృశ్యం న్యూస్ ||

నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో ఆస్తి పన్ను సేకరణపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో పన్ను సేకరణ విషయంలో అధికారులకు, సిబ్బందికి ఎదురైన సందేహాలను కమిషనర్ తో చర్చించి స్పష్టం చేసుకున్నారు.

పన్ను సేకరణ బృందానికి పలు సూచనలు చేసి, ప్రతిపాదించిన లక్ష్యాలను పూర్తి చేయాలని ప్రేరేపించారు.
అదేవిధంగా ఆస్తి పన్ను సేకరణపై ఆదేశాలు ఇచ్చిన కమిషనర్ దానిని అమలు చేయడంలో ఉన్న సవాళ్లను అధిగమించాలని అందరికీ విజ్ఞప్తి చేశారు. బృందం ప్రతి రోజూ సమయానికి విధి నిర్వహణ చేపడుతూ ప్రజల నుంచి అన్ని పన్నుల బకాయిలను సేకరించడమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment