|| దృశ్యం న్యూస్ ||
ప్రజావాణి ద్వారా ప్రజా సమస్యల పరిష్కారం – జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
మెదక్; జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ నేతృత్వంలో సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు ప్రజావాణి కార్యక్రమం కీలకమని తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి 85 దరఖాస్తులు అందాయి.

అర్జీల సంఖ్య:
✅ ధరణి సమస్యలు – 30
✅ పెన్షన్ – 03
✅ ఇందిరమ్మ ఇల్లు – 03
✅ ఉద్యోగ ఉపాధి – 02
✅ ఇతర సమస్యలు – 47
కలెక్టర్ అధికారులకు తగిన సూచనలు ఇచ్చి, ప్రతి దరఖాస్తును క్షేత్ర స్థాయిలో పరిశీలించి తక్షణ పరిష్కారం అందించాలన్నారు. ప్రజావాణి ద్వారా ప్రజా సమస్యలకు సమాధానం ఇచ్చేందుకు ప్రభుత్వ యంత్రాంగం కట్టుబడి ఉందని కలెక్టర్ స్పష్టం చేశారు.








