నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో డే కేర్ క్యాన్సర్ సెంటర్ ప్రారంభం.

|| దృశ్యం న్యూస్ ||

నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో డే కేర్ క్యాన్సర్ సెంటర్‌ను ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి ఈ రోజు జూమ్ సమావేశం ద్వారా వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సెంటర్ ప్రధాన ఉద్దేశ్యం క్యాన్సర్ రోగులకు పగటి సమయంలోనే సమయానుకూలంగా చికిత్స అందించడం.

ఇప్పటి వరకు ఎంజెఎన్‌జె (MNJ) ఆసుపత్రిలో మొదటి డోస్ తీసుకున్న రోగులు ఇకపై రెండో డోస్ నుండి నిజామాబాద్ డే కేర్ సెంటర్‌లోనే చికిత్స పొందే అవకాశం ఉంది. దీని ద్వారా రోగులు హైదరాబాదుకు ప్రయాణం చేయకుండా స్థానికంగానే చికిత్స పొందగలరు.

అదనంగా, ఈ సెంటర్‌లో క్యాన్సర్ చికిత్సకు అవసరమైన ఔషధాలు అందుబాటులో ఉంచబడ్డాయి. దీని వల్ల నిజామాబాద్ మరియు పరిసర ప్రాంతాల రోగులకు సమయానుకూల చికిత్స సులభంగా లభిస్తుంది అని సూపరింటెండెంట్ శ్రీనివాస్ తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment